ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్ పర్యటనలో భాగంగా గుజరాత్, జామ్నగర్లోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం **’వంతారా’**ను సందర్శించారు. అనంత్ అంబానీ స్వయంగా స్థాపించిన ఈ కేంద్రంలో మెస్సీ జంతువులతో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ ఒక అరుదైన మరియు అత్యంత ఖరీదైన గడియారాన్ని బహుమతిగా అందజేశారు.
మెస్సీకి బహుమతిగా ఇచ్చిన ఆ గడియారం పేరు ‘రిచర్డ్ మిల్లె RM 003-V2 GMT’ టూర్బిల్లాన్ ఆసియా ఎడిషన్. ఈ రకమైన వాచీలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 పీస్లు మాత్రమే ఉండటం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ విలువల ప్రకారం దీని ధర సుమారు 1.2 మిలియన్ డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 10.91 కోట్లు. వంతారా సందర్శనకు వచ్చే సమయంలో మెస్సీ చేతికి ఎలాంటి వాచ్ లేకపోగా, అనంత్తో భేటీ తర్వాత ఈ ఖరీదైన గడియారం ఆయన చేతికి కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కేవలం మెస్సీకి గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా, అనంత్ అంబానీ స్వయంగా ధరించిన వాచ్ కూడా నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఆయన ధరించిన రిచర్డ్ మిల్లె RM 056 సఫైర్ టూర్బిల్లాన్ విలువ సుమారు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 45.59 కోట్లు) అని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మెస్సీ వంతారా సందర్శన మరియు అంబానీ ఇచ్చిన ఈ భారీ కానుకకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









