యువకవులకు కవితానిర్మాణాలపై శిఖ్షణనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పిలుపునిచ్చారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్,విమలా సాహితీ సమితి ఆధ్వర్యంలో నగరంలోని యువకవులకు “ఆధునిక వచనకవితా నిర్మాణ పద్ధతులపై”శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా.జెల్ది విద్యాధర్ రాసిన కోహినూర్,ముసాఫిర్ తెలుగు కవితా సంపుటాల ఆంగ్లానువాద గ్రంథాలను కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు.డా.విద్యాధర్ గొప్ప ప్రేమతత్వంతో ,మానవీయ కోణంలో రాసిన కవితా సంపుటాలను ఎంతో సృజనాత్మక ప్రతిభతో అనువాదకులు కొండపాక రవీంద్రాచారి ఆంగ్లంలో అనువదించడం అభినందనీయమన్నారు.ప్రముఖ కవి, కళారత్న డా.బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ‘కవిత్వ కార్యశాల’లో ప్రపంచ కవితా నిర్మాణాలపై బిక్కి కృష్ణ,ఆధునిక కవిత్వం వస్తువైవిధ్యం పై డా.నాళేశ్వరం శంకరం,వచన కవిత్వం అభివ్యక్తి నవ్యతపై శైలజామిత్రలు శిక్షణనిచ్చారు.డా.పి.విజయలక్ష్మి పండిట్ కవిత్వంపై కీలకోపన్యాసం చేశారు.బిక్కి కృష్ణ రాసిన ‘కవిత్వం -డిక్షన్ ‘పుస్తకాన్ని డా.రాధా కుసుమ పరిచయం చేశారు.పద్మశ్రీలత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కవిత్వకార్యశాలలో అనే
కమంది కవులు పాల్గొని తమ కవితలు వినిపించారు.వాటిని శిక్షకులు విశ్లేషించి కవులను అభినందించారు.









