UPDATES  

NEWS

 జూబ్లీహిల్స్ ఓటమిపై మాగంటి సునీత ఘాటు వ్యాఖ్యలు: “రౌడీయిజంతో గెలిచింది, నైతిక విజయం నాదే”

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల ఫలితంపై ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా, నైతిక విజయం మాత్రం తనదే అని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం దారుణంగా ఫ్లాప్ అయ్యిందని ఆరోపించిన సునీత, ఈ ఎన్నికలు రౌడీల కనుసన్నల్లోనే జరిగాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మాగంటి సునీత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని మరియు రౌడీయిజంతోనే గెలిచిందని ఆరోపించారు. “కాంగ్రెస్ పార్టీ నీచబుద్ధి బయటపడింది. ఒక ఆడబిడ్డను ఎంత హింస పెట్టాలో, అంతకన్నా ఎక్కువగానే హింసించారు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గెలిచిన గెలుపు ఇది అని విమర్శించిన సునీత, పోలింగ్ కేంద్రాల్లో కూడా తమపై ర్యాగింగ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్‌కు మద్దతివ్వడం వల్లే ఆ పార్టీకి ఇంత భారీ మెజారిటీ వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతిచ్చిన వారందరికీ మాగంటి సునీత కృతజ్ఞతలు తెలిపారు. ఉపఎన్నికల ప్రచారం సమయంలో తాను నవ్వినా, ఏడ్చినా కూడా తప్పు అన్నట్లుగా తనపై ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రులతో సమావేశం కానున్నట్లు, అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి ఫలితాలపై స్పందించనున్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |