UPDATES  

NEWS

 చిరంజీవి ‘విశ్వంభర’ సెట్స్ పై అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. కునాల్ కపూర్ సెట్స్ పై అడుగుపెట్టాడని వెల్లడించింది.

 

కాగా, కునాల్ ‘విశ్వంభర’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. అతడే విలన్ అని రివీల్ అయ్యే సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.

 

‘విశ్వంభర’ చిత్రం 2025 సంక్రాంతి సీజన్ లో విడుదల కానుంది. చిత్రబృందం జనవరి 10వ తేదీని రిలీజ్ డేట్ గా ఇప్పటికే లాక్ చేసింది. ఈ సినిమా షూటింగ్ జులై నాటికి పూర్తి కానుండగా, కథను అనుసరించి గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నా

రు.

 

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |