UPDATES  

NEWS

 మేడారంలో ధరల దోపిడీ: భక్తుల ఆవేదన.. అద్దెకు చెట్టు నీడ!

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతరకు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని స్థానిక వ్యాపారులు, తోటల యజమానులు ధరలను విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం సుమారు ₹251 కోట్లు వెచ్చించి సకల ఏర్పాట్లు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రైవేట్ వ్యాపారాల దోపిడీని అరికట్టడంలో లోపాలు కనిపిస్తున్నాయని భక్తులు వాపోతున్నారు.

1. ఆకాశాన్నంటిన మాంసం, బెల్లం ధరలు

అమ్మవార్లకు సమర్పించే బెల్లం (బంగారం) ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఇక మొక్కుల కోసం వినియోగించే కోళ్లు, మేకల ధరలు రెట్టింపు అయ్యాయి:

  • బయట మార్కెట్‌లో ₹180 ఉండే బ్రాయిలర్ కోడి ధర మేడారంలో ₹350 పలుకుతోంది.

  • లైవ్ మేకపోతు ధర కిలో ₹1000కి చేరగా, మటన్ ధర ఏకంగా ₹1500 వరకు వసూలు చేస్తున్నారు.

  • నాటుకోడి ధర ₹700 మార్కును దాటేసింది. జాతర రద్దీ పెరిగేకొద్దీ ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది.

2. గదుల అద్దెలు.. వేలల్లో వసూలు

మేడారం పరిసరాల్లో వసతి సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో ప్రైవేట్ లాడ్జీలు, ఇళ్ల యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేని గదికి సైతం రోజుకు ₹6,000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ హరిత హోటళ్లు మరియు అతిథి గృహాలు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో, సామాన్య భక్తులు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవ్వక తప్పడం లేదు.

3. వింత దోపిడీ: చెట్టు నీడకూ అద్దె!

ఇళ్లు లేదా గదులు దొరకని భక్తులు చెట్ల కింద బస చేసేందుకు ప్రయత్నిస్తుంటే, అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. జాతర పరిసరాల్లోని తోటల యజమానులు కేవలం వంట చేసుకుని, సేద తీరడానికి ఒక్కో చెట్టు కింద నీడ కోసం ₹1000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇలా గాలిని, నీడను కూడా అమ్ముకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |