UPDATES  

NEWS

 రాజమండ్రిలో నారా లోకేశ్ పర్యటన: నన్నయ్య వర్సిటీలో రూ.34 కోట్లతో నూతన భవనాల ప్రారంభోత్సవం

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. మంజీరా బ్లాక్ (పరీక్షల భవనం), గౌతమి బ్లాక్ (కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్), మరియు ఇంద్రావతి బ్లాక్ (స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్)లను జాతికి అంకితం చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్న శ్రీ మరియు ఇతర అధికారులు మంత్రికి ఘనస్వాగతం పలికారు.

అంతకుముందు, మంత్రి లోకేశ్ చారిత్రాత్మక రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద నూతన లోగోను ఆవిష్కరించడంతో పాటు, పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్’ అనే వినూత్న సైన్స్ ప్రాజెక్టును ఆయన పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

కళాశాల అభివృద్ధిలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (PPP) మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) నిధులు, కార్పొరేట్ సంస్థల CSR నిధులు మరియు పూర్వ విద్యార్థుల విరాళాలతో కళాశాల రూపురేఖలు మారడం సంతోషదాయకమన్నారు. హన్స సొల్యూషన్స్ నిర్మించిన ఇన్నోవేషన్ హబ్ మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం వివిధ క్రీడల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాణించిన విద్యార్థులను మంత్రి అభినందించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |