UPDATES  

NEWS

 ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు షాక్.. రేపే లొంగిపోవాలని ఆదేశం!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిట్ అధికారుల ఎదుట శుక్రవారం (రేపు) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బేషరతుగా లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు మంజూరు చేసిన మధ్యంతర అరెస్ట్ ఉపశమనాన్ని ఎత్తివేయాలని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వచ్చాయి.

సిట్ (SIT) దాఖలు చేసిన పిటిషన్‌లో, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా, కేసులో కీలకమైన ఐఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఆయన రీసెట్ చేసి, సమాచారం ఇవ్వడం లేదని సిట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

అయితే, విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దర్యాప్తు బృందానికి (సిట్‌కు) ఒక ముఖ్యమైన సూచన చేసింది: విచారణ సందర్భంగా ప్రభాకర్ రావును శారీరకంగా హింసించవద్దని ప్రత్యేకంగా ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది, ఇది దర్యాప్తులో కొత్త మలుపునకు దారి తీయనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |