ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం (DWCWEO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ గార్డ్ వంటి మొత్తం 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 13,000 నుండి గరిష్టంగా రూ. 34,000 వరకు వేతనం లభిస్తుంది.
ఈ నోటిఫికేషన్ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి విద్యార్హతలు పదో తరగతి నుండి డిగ్రీ, ఎల్ఎల్బీ మరియు మాస్టర్స్ డిగ్రీ వరకు నిర్ణయించారు. పదో తరగతి పాసైన వారు కూడా మల్టీపర్పస్ స్టాఫ్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ annamayya.ap.gov.in నుండి అప్లికేషన్ ఫారమ్ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన హార్డ్ కాపీలను సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మార్చి 13వ తేదీ దరఖాస్తుకు చివరి గడువుగా నిర్ణయించారు కాబట్టి, అర్హత గల అభ్యర్థులు వెంటనే స్పందించాలని అధికారులు సూచించారు.








