UPDATES  

NEWS

 తెలంగాణ ‘గ్లోబల్ సమ్మిట్’కు మోదీని ఆహ్వానించనున్న సీఎం రేవంత్: ప్రపంచ దిగ్గజాలు హాజరు!

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025’ ను భారీగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ‘తరలి రండి – ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు అవ్వండి’ అనే నినాదంతో చేపడుతున్న ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధి దిశ, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ పథక దిశానిర్దేశక పత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు.

ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ప్రతిష్ఠాత్మక అతిథులు హాజరుకానున్నారు. వీరిలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యూఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, పలువురు గ్లోబల్ స్థాయి సీఈవోలు, పెట్టుబడిదారులు పాల్గొనడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు.

ఈ ప్రతిష్ఠాత్మక సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరి, హెచ్‌డీ కుమారస్వామి వంటి ప్రముఖులను కూడా ఆయన ఆహ్వానించనున్నారు. ఈ సందర్శన సమయంలో, రాష్ట్రంలోని జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణ వంటి కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతిపత్రాలు కూడా ముఖ్యమంత్రి ప్రధానికి అందించే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |