UPDATES  

NEWS

 ‘ఐబొమ్మ రవి’ వ్యవహారంపై స్పందించిన శివాజీ: పరిశ్రమలో 95 శాతం మందిది సాధారణ జీవితమే

పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారంపై నటుడు శివాజీ స్పందించారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా శిక్ష తప్పదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సినీ పరిశ్రమలో అందరూ విలాసవంతమైన జీవితం గడుపుతారనేది ఒక అపోహ మాత్రమేనని, 95 శాతం మంది సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారని శివాజీ తెలిపారు. కేవలం 5 శాతం మంది విలాసవంతంగా జీవించే వారిని చూసి మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమా టికెట్ల ధరల పెంపుపై వస్తున్న విమర్శలను శివాజీ తీవ్రంగా ఖండించారు. “పండగ సమయాల్లో బస్సు టికెట్ల ధరలు మూడు రెట్లు పెంచుతారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, సినిమా టికెట్ ధర రూ.100 పెరిగితే మాత్రం ఇండస్ట్రీని విలన్‌గా చిత్రీకరిస్తారు” అని శివాజీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. టికెట్ల ధరల పెంపుపై వస్తున్న విమర్శలు అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నటుడు శివాజీ ప్రేక్షకులకు ఒక ఆసక్తికర సూచన చేశారు. థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్‌లు ఆరోగ్యానికి మంచివి కావని, వాటిని తినకపోవడమే ఉత్తమమని ఆయన అన్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని శివాజీ విశ్వాసం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |