UPDATES  

NEWS

 తెలంగాణ బీసీ బంద్ ఎఫెక్ట్: దీపావళికి ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ బంద్ ప్రభావంతో సాధారణ రవాణా వ్యవస్థ స్తంభించింది. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు అన్నీ డిపోలకే పరిమితం కావడంతో, దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లో స్థిరపడినవారు శని, ఆదివారాలు కలిసి రావడంతో మూడు రోజులపాటు ఇళ్లకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు, కానీ బంద్ కారణంగా ఆ ప్లాన్‌కు ఆటంకం ఏర్పడింది.

బస్సులు, ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్‌స్టాండ్‌లు బంద్ కారణంగా బోసిపోయి కనిపిస్తున్నాయి. పండుగకు ఎలాగైనా ఇళ్లకు చేరుకోవాలని పట్టుదలగా ఉన్న ప్రయాణికులు బస్‌స్టాండ్ల బయట బస్సుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆర్టీసీ సేవలు నిలిచిపోవడంతో, చేసేదేమీ లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ బంద్ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. రెండింతలు, కొన్నిసార్లు నాలుగు రెట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో రూ. 200 ఉండే ఛార్జీని, ప్రైవేట్ కార్ల డ్రైవర్లు ఏకంగా రూ. 800 వరకు డిమాండ్ చేస్తున్నారు. చేసేదేమీ లేక ప్రయాణికులు వారు అడిగినంత చెల్లించి సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |