UPDATES  

NEWS

 విశాఖలో లులూ మాల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించనున్న దుకాణ సముదాయం (షాపింగ్ మాల్), హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా ఈ భూకేటాయింపులు జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లులూ గ్రూప్ ప్రతిపాదనలను పరిశీలించి భూకేటాయింపులు జరపాలని ఏపీఐఐసీని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.

 

బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మాణానికి పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ ఆమోదం తెలిపిందని పరిశ్రమల శాఖ వెల్లడించింది.

 

2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. 2023లో ఈ భూకేటాయింపులను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. లులూ గ్రూప్ ఇప్పుడు షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణం కోసం ముందుకు వచ్చింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో సామాజిక సేవల విభాగంలో కళారత్న (హంస) అవార్డుకి ఎంపికైన అవే సంస్థ వ్యవస్థాపకుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారాత్న (హంస) అవార్డును అందుకోవడం జరిగినది..

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |