UPDATES  

NEWS

 నిందితుల జాబితాలో ఆప్.. కోర్టుకు తెలిపిన ఈడీ..!

ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని అత్యున్నత న్యాయస్థానానికి దర్యాప్తు సంస్థ ఈడీ శుక్రవారం పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు నేడు విచారించింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈరోజు ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేస్తున్నారని, ఆప్‌ను నిందితుడిగా చేశారని ఈడీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

 

ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పలో జరిగిన మనీలాండరింగ్ విషయంపై ఈడీ కేసు నమోదు చేసింది. పాత పాలసీని సవరించేటప్పుడు అనేక అవకతవకలు జరిగాయని.. లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారంటూ సీబీఐ, ఈడీ పేర్కొంది.

 

సౌత్ గ్రూప్ అందించిన రూ. 100 కోట్ల లంచంలో రూ. 45 కోట్ల “కిక్‌బ్యాక్”లను ఆప్ 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారని ఆరోపించింది దర్యాప్తు సంస్థ.

 

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం 6 శాతం కిక్‌బ్యాక్‌ ఇచ్చే విధంగా వ్యాపారుల ప్రాఫిట్ మార్జిన్‌ను 12 శాతానికి పెంచిందని, దీని వలన ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. అటు ఆప్ మీడియా హెడ్ విజయ్ నాయర్ పార్టీ తరపున ‘సౌత్ గ్రూప్’ నుంచి అడ్వాన్స్ గా రూ.100 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు.

 

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కె. కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 18 మందిని అరెస్టు చేశారు.

 

ఏప్రిల్ 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |