UPDATES  

NEWS

 టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మొదలైన దరఖాస్తు ప్రక్రియ..

రాష్ట్రంలోని టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ప్రారంభమైంది. ఈ సారి డీఎస్సీ కంటే టీచర్ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించబోతోంది.

 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో 4 లక్షల మంది టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నారు. అయితే డీఎస్సీ పరీక్షకు ముందు రాష్ట్రంలో టెట్ నిర్వహించడంతో ఈ ఏడాది డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం టెటే రాయనున్నారు. సర్వీసు టీచర్లు సైతం టెట్ పరీక్షకు హాజరవుతున్నారు.

 

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బుధవారం నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ చేసుకోవచ్చు. ఈ అర్హత పరీక్షలు మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి.

 

ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఓ ఎగ్జామ్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో ఎక్జామ్ జరగనుంది. మే 15వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులోకి వస్తాయని పరీక్ష నిర్వాహణ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల ఫలితాలు జూన్ 12న విడుదల చేయనున్నారు. అయితే అభ్యర్థులు ఒక పేపర్ రాయాలనుకుంటే రూ.1,000 ఫీజు, అదే రెండు పేపర్లలో పరీక్ష రాయాలనుకుంటే రూ.2,000 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |