UPDATES  

NEWS

 జై హనుమాన్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ…మామూలుగా ఉండదట..!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత పెద్ద తోపు సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా 20 రోజులు మా అంటే 30 రోజులు మహా అంటే 40 రోజులు.. అంతకు మించి థియేటర్లలో ఆడడం లేదు. కానీ చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సాధించిన హనుమాన్ చిత్రం మాత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇది రికార్డు అని చెప్పుకోవాలి. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాను తట్టుకుని ఈ మూవీ దూసుకెళ్తోంది.

 

ఈ సినిమా 150 థియేటర్లలో 50 పూర్తి చేసుకుంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇచ్చిన మూవీ హిస్టారికల్ 50 డేస్ పండుగను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. హనుమాన్ సిక్వెల్ అయిన జై హనుమాన్ స్క్రిప్ట్ పూర్తయినట్లు ప్రకటించాడు. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ వర్క కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరలో జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని ప్రకటించాడు.

 

జై హనుమాన్ లో హనుమంతడే హీరో అని ప్రకటించాడు. హనుమాన్ ఎలా ఉందో.. జై హనుమాన్ అలానే ఉంటుందని అన్నాడు. ప్రతి ఒక్కరకి నచ్చేలా మూవీని తెరకెక్కిస్తానని చెప్పాడు. జై హనుమాన్ మూవీలో తేజ సజ్జ హనుమంతు పాత్రలోనే కనిపిస్తారట.. కానీ ఆంజనేయుడి పాత్రలో ఓ స్టార్ హీరో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జై హనుమాన్ మూవీని 2025 సంక్రాతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.

 

ఇక హనుమాన్ మూవీ రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వేచి చూస్తున్నారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ సంబంధించి జీ5 ప్రకటన చేసింది. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న హనుమాన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హనుమాన్ ఓటీటీ రైట్స్ భారీ ధర దక్కింది. రూ.16 కోట్లకు జీ5 హనుమాన్ ఓటీటీ రైట్స్ సొంత చేసుకుంది. ఇందులో తెలుగు వెర్షన్ కు రూ.11 కోట్లు, హిందీ వెర్షన్ కు రూ.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |