UPDATES  

NEWS

 ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ మోసం: సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

ఆటిజం (Autism) చికిత్స కోసం స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడం శాస్త్రీయంగా నిరూపణ కాలేదని, దీనిని ఒక వైద్యపరమైన మోసంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమోదం పొందిన క్లినికల్ ట్రయల్స్ వెలుపల రోగులపై ఇలాంటి ప్రయోగాలు చేయడం అనైతికమని, తప్పుడు నమ్మకాలతో ప్రజలను వంచించడం వైద్య నైతికతకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పును ఎయిమ్స్ (AIIMS) వంటి అగ్రశ్రేణి సంస్థల వైద్య నిపుణులు స్వాగతించారు. ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ మంజరి త్రిపాఠి మాట్లాడుతూ.. ఆటిజం లేదా ఇతర నరాల సంబంధిత సమస్యలకు స్టెమ్ సెల్స్ పనిచేస్తాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు రోగుల నుంచి రూ. 6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయని, ఈ తీర్పుతో ఆ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, స్టెమ్ సెల్స్ పట్ల శాస్త్రీయ పరిశోధనలను కోర్టు పూర్తిగా తోసిపుచ్చలేదు. నియంత్రిత పరిస్థితులలో మరియు ప్రభుత్వం గుర్తించిన క్లినికల్ ట్రయల్స్ రూపంలో మాత్రమే పరిశోధనలు కొనసాగించవచ్చని ధర్మాసనం వెల్లడించింది. ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మరియు ఐసీఎంఆర్ (ICMR) కూడా ఆటిజం చికిత్సకు స్టెమ్ సెల్ థెరపీని సిఫార్సు చేయడం లేదని వైద్యులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |