UPDATES  

NEWS

 “ఏ ఫర్ ఆంధ్రా”: ‘ఇండియాస్ న్యూ టెక్ డార్లింగ్’గా ఏపీకి మనీకంట్రోల్ కితాబు

2025 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, మనీకంట్రోల్ సంస్థ దేశంలోని టెక్నాలజీ మరియు స్టార్టప్ రంగాల్లోని పరిణామాలపై ‘ఏ టు జడ్’ (A-Z) పేరుతో ఒక ప్రత్యేక నివేదికను రూపొందించింది. ఈ జాబితాలో మొదటి అక్షరమైన ‘ఏ’ (A) కి ‘ఏ ఫర్ ఆంధ్రా’ (A for Andhra) అని నామకరణం చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారుతూ, నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతోందని ఈ నివేదిక ప్రశంసించింది.

మంత్రి నారా లోకేశ్ ఈ నివేదికపై స్పందిస్తూ, “2025 ఏ టు జడ్ జాబితా ఆంధ్రా పేరుతో మొదలవ్వడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ‘భారతదేశపు నూతన టెక్ డార్లింగ్’ (India’s new tech darling) గా అవతరించింది” అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మారుతున్న టెక్నాలజీ ముఖచిత్రానికి, ప్రభుత్వం కల్పిస్తున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తును నడిపించే ఆర్థిక శక్తిగా ఏపీ ఎదుగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు వంటి భారీ పెట్టుబడులు ఏపీని గ్లోబల్ టెక్ మ్యాప్‌లో నిలబెట్టాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మనీకంట్రోల్ వంటి ప్రముఖ సంస్థ నుంచి ఈ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల ఐటీ మరియు పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |