టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో అద్భుతంగా రాణిస్తూ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లీ, రాయ్పూర్లో జరిగిన రెండవ వన్డేలో కూడా మరో పవర్ ఫుల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో కోహ్లీకి ఇది వరుసగా రెండవ సెంచరీ కావడం విశేషం.
రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోహ్లీ 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 90 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన కోహ్లీకి వన్డేల్లో ఇది 53వ సెంచరీ, అంతర్జాతీయ క్రికెట్లో 84వ సెంచరీ. గత కొద్ది రోజులుగా ఫామ్ లేక పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, కోహ్లీ ఈ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు.
కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడా లేదా అనే చర్చ జరుగుతున్న సమయంలో, తన ప్రస్తుత ఫామ్తో తాను ఆ ఐసీసీ టోర్నీ వరకు ఆడగలనని చాటి చెప్పాడు. విరాట్ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. టెస్టులు, టీ20 క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన నేపథ్యంలో, ఈ సిరీస్లో వరుస సెంచరీలతో తన ఫిట్నెస్ మరియు సామర్థ్యాన్ని కోహ్లీ మరోసారి నిరూపించుకున్నాడు.









