UPDATES  

NEWS

 వైఎస్ జగన్: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు, బెంగళూరుకు పయనం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. విదేశీ పర్యటన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత హాజరును రికార్డు చేశారు.

  • కోర్టు హాల్‌లో జగన్ సుమారు ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారు.

  • న్యాయమూర్తి ఏమైనా చెప్పదలుచుకున్నారా అని అడగగా, ఆయన తరపు న్యాయవాది ‘నో’ అని బదులిచ్చారు.

  • హాజరు పూర్తయిన వెంటనే జగన్ కోర్టు నుంచి లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్లారు.

బెంగళూరుకు పయనం:

మధ్యాహ్నం 2 గంటల సమయంలో, జగన్ లోటస్ పాండ్‌ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.

అభిమానుల స్వాగతం:

బేగంపేట ఎయిర్ పోర్టు వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు “సీఎం.. సీఎం” అంటూ నినాదాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |