UPDATES  

NEWS

 ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఈసీ వేటు! 474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం..

దేశంలో కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. నిబంధనలను పాటించని వందలాది పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంది. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 808 రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ పార్టీల నమోదును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

 

 

ఈ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 9న తొలి దశలో 334 పార్టీల నమోదును ఈసీ రద్దు చేసింది. రెండో దశ చర్యల్లో భాగంగా, శుక్రవారం మరో 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఆరేళ్లుగా వరుసగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం, ఇతర నిబంధనలను ఉల్లంఘించడమే ఈ నిర్ణయానికి కారణమని స్పష్టం చేసింది.

 

తాజాగా తీసుకున్న చర్యలతో కలిపి మొత్తం తొలగించిన పార్టీల సంఖ్య 808కి చేరింది. ఈసీ తాజా ప్రక్షాళనతో, దేశంలో రిజిస్టర్ అయి గుర్తింపు లేని పార్టీల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ చర్యలతో గుర్తింపు లేని రాజకీయ పార్టీల సంఖ్య 2,046కి తగ్గింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |