UPDATES  

NEWS

 పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీన ఉదయం 10:08 గంటలకు ‘ఓజీ’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

 

ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానుల సందడి మొదలైంది. “అభిమానులకు అసలైన విందును అందించేందుకు ఓజీ సిద్ధమవుతున్నాడు” అంటూ చిత్ర యూనిట్ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ ప్రకటనతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

 

‘సాహో’ వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ‘ఓజీ’పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్‌ను మునుపెన్నడూ చూడని గ్యాంగ్‌స్టర్ అవతారంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ నటుడు అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 21న రాబోయే ట్రైలర్‌తో సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఒక స్పష్టత వస్తుందని, పవన్ కల్యాణ్ మాస్ అవతార్‌ను చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓజీ’ చిత్రం సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |