UPDATES  

NEWS

 ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫోన్ట్యాపింగ్వ్యవహారంలో జడ్జీలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్నంబర్ప్రచురించినట్లు హైకోర్టు ప్రస్తావించింది.

 

ఫోన్ట్యాపింగ్‌పై మీడియా సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, ఫోన్ట్యాపింగ్కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్దాఖలు చేశారని పేర్కొంది. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని హైకోర్టు తెలిపింది. వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది.

 

జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జులై 23న కౌంటర్దాఖలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో కేసును ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును హైకోర్టు సీజే బెంచ్ విచారిస్తోంది. కాగా, పలు రాజకీయ నేతలతో పాటు జడ్జీల ఫోన్లు ట్యాప్చేశారని పత్రికల్లో కథనాల ఆధారంగా ఫోన్ట్యాపింగ్కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

 

ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్లు కౌంటర్‌లో ప్రభుత్వం తెలిపింది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్చేసినట్లు కౌంటర్అఫిడవిట్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి హైకోర్టు బుధవారం విచారణ చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వానికి సంయమనం పాటించాలని స్పష్టం చేసింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |