ప్రధానమంత్రి కిసాన్ యోజన, దీనిని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని కూడా పిలుస్తారు. రైతులకు ఆర్థిక బలం చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఈ పథకం డిసెంబర్ 1, 2018న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఈ పథకం కింద, అర్హులైన భూమి ఉన్న రైతు కుటుంబాలందరికీ ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. దీని కోసం ప్రతి మూడో నెలకు రూ.2,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ విధంగా ఒక్కో లబ్ధిదారునికి ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది.
పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 16 వాయిదాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 28న చివరి విడత రూ.2వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమకాగా ప్రస్తుతం 17వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ యోజన 16వ విడత ఫిబ్రవరిలో విడుదలైనందున, 17వ విడత తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుందని భావిస్తున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం eKYCని తప్పనిసరి చేసింది. “PMKISAN నమోదిత రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKISAN పోర్టల్లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC (sic) కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.” అని అధికారిక వెబ్సైట్ పేర్కొంది,









