UPDATES  

NEWS

 ఇందిరమ్మ ఇల్లు కావాలా.. ఈ అర్హతలు ఉండాలి.

పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఒక్కో పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. అభయహస్తం దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. గృహజ్యోతి, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి ఇలాగే లబ్ధిదారులను ఎంపిక చేసింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటించింది. ఇల్లులేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థికసాయం అందించబోతుంది. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనాను సీఎం విడుదల చేశారు.

 

ఎవరు అర్హులంటే..

ఇక ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ఎవరు అర్హులంటే.. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరిట మాత్రమే ఇస్తారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలిదశలో సొంతంగా జాగా ఉండి, అందులో ఇల్లు లేనివారికి ఆర్థికసాయం అందుతుంది. లబ్ధిదారులు స్థానికులై ఉండాలి. అద్దుకు ఉన్నవారు కూడా అర్హులు.

 

ఎంపిక ఇలా..

ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారల ఎంపిక జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. కలెక్టర్లు ఫైనల్‌ లిస్టు రెడీ చేస్తారు. గ్రామ పంచాయతీలో ఉన్న జనాభా ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తారు. తర్వాత లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లు వార్డు మీటింగ్‌లు నిర్వహించి ప్రకటిస్తారు. తర్వాత ఆర్డీవో ద్వారా కలెక్టర్‌కు పంపిస్తారు. ఇన్‌చార్జి మంత్రి ఫైనల్‌ చేస్తారు.

నాలుగు దశల్లో ఆర్థికసాయం..

ఇక లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షల సాయం అందిస్తుంది. సొంత జాగా ఉన్నవారికి మొదట సాయం ఇవ్వనున్నారు. మొత్తం నాలుగు దశల్లో ఆర్థికసాయం అందుతుంది. బేస్‌మెంట్‌ పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్‌ లెవల్‌కు వచ్చాక మరో రూ.లక్ష, స్లాబ్‌ పూర్తయ్యాక రూ.2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తుంది. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరుగకుండా, అవకతవకలకు తావు లేకుండా అర్హులను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |