కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి జూన్ 30, 2024 వరకు సమయాన్ని పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేసింది.
ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు ప్రకారం, మార్చి 6లోగా ఎస్బీఐ ఈసీఐకి బాండ్లవ వివరాలను అందించాల్సి ఉంటుంది.
పొడిగింపు దరఖాస్తులో, SBI ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో, వివిధ పార్టీలకు విరాళాలు ఇవ్వడం కోసం ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు (22,217) ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు పేర్కొంది. రిడీమ్ చేసిన బాండ్లను ప్రతి దశ ముగింపులో అధీకృత శాఖల ద్వారా ముంబయి మెయిన్ బ్రాంచ్లో సీల్డ్ ఎన్వలప్లలో జమ చేస్తారు. రెండు వేర్వేరు సమాచారాలు ఉన్నందున, అది నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు (44,434) సమాచార సెట్లను డీకోడ్ చేసి, కంపైల్ చేసి సరిపోల్చాల్సి ఉంటుందని SBI పేర్కొంది.
మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు వారాల గడువు సరిపోదని ఎస్బీఐ పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తూ, సుప్రీంకోర్టు ఈ క్రింది ఆదేశాలు జారీ చేసింది:
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)కు చెందిన డాక్టర్ జయ ఠాకూర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు









