UPDATES  

NEWS

 పార్లమెంట్‌లో ‘ఛావా’ మూవి స్పెషల్ స్క్రీనింగ్..?

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించగా, డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, అలోక్ నాథ్, ప్రదీప్ రావత్ తదితర ప్రముఖులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషించారు. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అందించిన ఈ పీరియాడికల్ మూవీ, ఫిబ్రవరి 14న విడుదలై మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.ఇక మార్చి 7న తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కాగా, ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించినట్లు తెలుస్తోంది.

 

ఈ సినిమా తాలూకా స్పెషల్ స్క్రీనింగ్‌ని భారతదేశ పార్లమెంట్‌లో వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చి 27 గురువారం సాయంత్రం 6 గంటలకు ‘ఛావా’ ప్రత్యేక ప్రదర్శన ఉండబోనుండగా ఈ స్క్రీనింగ్‌కి దేశ వ్యాప్తంగా ఎంపీలు అంతా హాజరు కానున్నట్లు సమాచారం. అంతే కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్‌లో సినిమాని చూడనున్నారట. దీంతో ఈ టాక్ వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నప్పటికీ మేకర్స్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |