కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. గతేడాది కాంతార చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. కన్నడ పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లిన సినిమా. కన్నడ సినిమాలను ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆదరించేలా చేసిన సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతార 2 రాబోతుంది. అంటే.. కాంతార లో మనం చూసిన కథకు ముందు జరిగిన కథ అన్నమాట. ఈ సినిమా కోసం రిషబ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా రిషబ్.. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ను కలిశాడు. లెజెండరీ నటుడు మోహన్ లాల్ ను కలవడం చాలా గర్వంగా ఉందని తెలిపాడు. ఆయన ఫ్యామిలీ కూడా ఉండడంతో.. మోహన్ లాల్ ఇంటికి వెళ్లి మరీ రిషబ్ ఆయన భార్య ప్రగతి మీట్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎందుకు కలిశారు అనేది మాత్రం రిషబ్ చెప్పకపోవడంతో అభిమానులు తమ ఊహాగానాలు అల్లేసుకుంటున్నారు. కాంతార 2 కోసమే మోహన్ లాల్ ను దింపుతున్నాడని చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం రిషబ్.. మోహన్ లాల్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఇది కనుక నిజమైతే.. కాంతార 2 పై అంచనాలు మరింత రెట్టింపు అవుతాయి అని మాత్రం చెప్పొచ్చు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడక తప్పదు.