UPDATES  

NEWS

 నామినేషన్ల రోజు ఘర్షణలు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైటింగ్..

నామినేషన్ల సందడి ఇంకా మొదలుకాకముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన అధికార వైసీపీ- టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో కేడర్ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వేదికైంది.

 

డీటేల్స్ లోకి వెళ్తే.. కల్యాణదుర్గం పట్టణంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఇంటి నుంచి వెళ్తుండగా ఈ గొడవ జరిగింది. టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా దారికి అడ్డంగా వాహనాలను పెట్టారు వైసీపీ కార్యకర్తలు.

 

వాటిని తీయాలని కోరడంతో ఇరు వర్గాల మధ్య మాటలు కాస్త వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో టీడీపీ నేత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్‌బాబుపై దాడికి తెగబడ్డారు వైసీపీకి చెందిన కార్యకర్తలు. దీంతో ఆయన అక్కడిక్కడే పడిపోయారు.

 

రమేష్ తలకు గాయం కావడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి ఖండిస్తూ టీడీపీ శ్రేణులు పోలీసుస్టేషన్ వద్ద నిరసన తెలిపాయి. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగినట్టు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |