UPDATES  

NEWS

 సూపర్ యోధగా మారిన హనుమాన్….

నేనున్నా నాయనమ్మ అంటూ బాలనటుడిగా ఉన్నప్పుడే ఇండస్ట్రీని షేక్ చేసిన నటుడు తేజ సజ్జా. స్టార్ హీరోలందరి సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించిన తేజ.. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత మంచి మంచి కథలను ఎంచుకొని సోలో హీరోగా కొనసాగుతున్న వేళ.. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. స్వయానా మెగాస్టార్ చిరంజీవినే తేజ నటనకు ఫిదా అయ్యినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆ గుర్తింపును తన ఎదుగుదలకు వాడుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. పెద్ద పెద్ద బ్యానర్స్ లో తేజకు అవకాశాలు వస్తున్నాయి.

 

హనుమాన్ తరువాత ఈ కుర్ర హీరో మంచి ఛాన్స్ పట్టేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన తదుపరి సినిమాను తేజతో చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ యోధ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండగా.. దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం.

 

ఎప్పటి నుంచో ఈ సినిమా టైటిల్ మిరాయ్ అని ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా సరసన రితిక నాయక్ నటించనుంది. ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ను ఏప్రిల్ 18 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. హనుమాన్ తరువాత తేజ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో తేజ సజ్జా.. అదే సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |