UPDATES  

NEWS

 అక్రమ టోల్ గేట్ కేసు.. మ‌ళ్లీ పోలీస్ కస్ట‌డీకి మాజీ మంత్రి కాకాణి..

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఆయన్ను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు ఆయనను పోలీసులు విచారించనున్నారు.

 

వివరాల్లోకి వెళితే… కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ టోల్ గేట్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, పోలీసుల అభ్యర్థనను అంగీకరిస్తూ కస్టడీకి అనుమతులు మంజూరు చేసింది.

 

కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు, రేపు కాకాణిని నెల్లూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విచారించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విచారణలో టోల్ గేట్ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా, కాకాణి గోవర్ధన్ రెడ్డిపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు కూడా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆ కేసులో కూడా పోలీసులు ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుత విచారణలో టోల్ గేట్ కేసుతో పాటు క్వార్ట్జ్ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |