UPDATES  

NEWS

 అల్లు జంటను అన్‌ఫాలో చేసిన సాయి ధరమ్ తేజ్..!ఎందుకంటే..?

ఏపీ అసెంబ్లీ సమయంలో సినిమా హీరో అల్లు అర్జున్ గురించి పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో తన మిత్రుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి గెలవాలని కోరకుంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఆ తరువాత అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి వెళ్లారు. ఇక, అప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అంటూ నెటిజన్స్ పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటు నాగబాబు కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. మొత్తం ఇటు మెగా అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే, అటు అల్లు అర్జున్ అభిమానులు మెగా హీరోలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది.

 

అయితే, ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారం తరువాత పవన్, చిరంజీవి చేతులను పైకెత్తి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేసిన విషయం తెలిసిందే.

 

ఈ క్రమంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్ తోపాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లు పలు వార్తా కథనాలు వస్తున్నాయి. సాయి ధరంతేజ్.. తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వీరిద్దరినీ అన్ ఫాలో చేసినట్లుగా అందులో పేర్కొంటున్నారు. కేవలం అల్లు శిరీష్ ను మాత్రమే సాయి ధరమ్ తేజ్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ కాకుండా మిగతా మెగా హీరోలంతా కూడా అల్లు అర్జున్ ను ప్రస్తుతానికి ఫాలో అవుతూనే ఉండడం గమనార్హం.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |