UPDATES  

NEWS

 ప్రధాని మోడీని చంపేస్తామంటూ ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్..

ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమిళనాడు రాజధాని చెన్నైలోని పురశైవాకంలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ప్రధాని మోడీని హతమారుస్తానని బెదిరించాడు. గుర్తు తెలియని వ్యక్తి ప్రధాని మోడీని చంపేస్తానని హిందీలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసిన నంబర్‌ను పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు? ఏ సిమ్ కార్డు వాడాడు? అనే విషయాలను తెలుసుకునే పనిలో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు.

 

కాగా, వాంటెడ్ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసు కంట్రోల్ నంబర్‌లను ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ నెంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోడీని హతమారుస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడడం గమనార్హం.

 

గతంలోనూ బెదిరింపులు

 

కాగా, గతంలోనూ మోడీకి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌నుచంపుతానంటూ కొన్నాళ్ల క్రితం ఓ దుండగుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్చేశాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు.

 

నోయిడాలోని ఓ ప్రైవేట్మీడియా సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్ఆఫీసర్‌కు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఆ మీడియా సంస్థ ప్రతినిధులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. singhkartik78107@gmail.com అనే మెయిల్ ఐడీతో తమ కార్యాలయానికి సందేశం వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. దేశ ప్రధానినే చంపుతామని బెదిరింపులు రావడం వల్ల పోలీసులు ఈ కేసు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |