టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ వేడుకకు రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరం సిద్ధమైంది. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు పెళ్లి అని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఉదయం 10.10 గంటలకు ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే బుధవారం హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది.
ఈ వివాహం విజయ్ దేవరకొండ తెలుగు సంప్రదాయం మరియు రష్మిక మందన్నా కొడవ (కర్ణాటక) పద్ధతుల్లో జరగడం విశేషం. అతిథుల జాబితా విషయానికి వస్తే.. దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్ సహా హీరోయిన్లు కళ్యాణీ ప్రియదర్శన్, ఈషా రెబ్బ తదితరులు ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెళ్లి వేడుకలో గోప్యతను కాపాడేందుకు ‘నో మొబైల్’ పాలసీని కఠినంగా అమలు చేస్తున్నారు. వేదిక వద్దకు వచ్చే అతిథుల ఫోన్లను తీసుకుని, వాటికి ట్యాగ్లు వేసి భద్రపరుస్తున్నారు. ఫోటోలు లీక్ కాకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్ మరియు రష్మిక ఇద్దరూ తమ తమ రంగాల్లో స్టార్లుగా ఉన్నందున, వారి వివాహానికి ప్రధాని మోదీ నుంచి కూడా శుభాకాంక్షలు అందడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.








