UPDATES  

NEWS

 పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనకాపల్లిలో నిర్విహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై చేసిన విమర్శలకు గాను ఈసీ నోటీసులు జారీ చేసింది.

 

సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను గానూ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ జగన్ ఓ స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ విమర్శలు గుప్పించారు.

 

దీంతో ఏప్రిల్ 8వ తేదీన ఎలక్షన్ కమిషన్ కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ జగన్ పై వ్యాఖ్యలు చేశారంటూ విష్ణు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు.

 

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన 48 గంటల్లో జగన్ పై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పవన్ కు ఈసీ నోటీసులు జారీ చేయడంపై రాజకీయంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |