తనని తానే పవన్‌ వెన్నుపోటు పొడిచేసుకున్నాడ —రామ్‌గోపాల్‌ వర్మ .

 

 

ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. తన సొంత ఫ్యాన్స్‌నే కాకుండా తన కాపుల్ని, తనని తానే పవన్‌ వెన్నుపోటు పొడిచేసుకున్నాడని విమర్శించారు.
ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎన్నుపోటు పొడిచిన దానికంటే దారుణంగా ఈరోజు పవన్‌ తన జనసైనికులను, ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేశాడు..వాళ్ళ  ఫ్యామిలీ మెంబెర్స్  అందరికీ నా ప్రగాఢ సానుభూతి’ అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్  వచ్చే ఎన్నికల్లో కలిసివచ్చే పార్టీలతోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !